ఎల్ఐసి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర రూరల్ సెప్టెంబర్5 ప్రజ
మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలోలైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు జీవిత బీమా ఏజెంట్లు స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద ఈ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు మద్దతుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు వీరికి సంఘీభావం తెలిపారుఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, ఉద్యోగస్తులు కోరుతున్న న్యాయమైన కోర్కెలను వెంటనే అమలు చేయాలని ఏజెంట్లకు గ్రాట్యుటీ ఇరవై లక్షలు పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా,ఏజెంట్ల కమిషన్ 2013,2016 ఐ. ఆర్.డీ. ఏ.గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం చెల్లించాలన్నారు. ఏజెంట్లు అందరికీ మెడి క్లయిమ్ వర్తింపచేయాలని కోరారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ స్కీం లను ప్రవేశపెట్టాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ *కోనాధని కుమార్* కాంగ్రెస్ నాయకులు *కర్నాటి రామారావు, నిడమనూరి వంశీ* *కోట డేవిడ్, ఆదిమూలం శ్రీనివాసరావు* మొదలగువారు పాల్గొన్నారు
Share this on your social network: