ఘనంగాచందాలకేశవదాసు145 జయంతి

Published: Monday June 21, 2021
తొలి తెలుగు సినీ గేయ రచయిత కనకతార, బలిబంధనం, నాటక రచయిత, 
మధిర ప్రజాపాలన ప్రతినిధి 20వ తేదీ మున్సిపాలిటీ మధిరఅనేక సినిమాలకు పాటల రచయిత మన ఖమ్మం జిల్లా వాసి  చందాల కేశవదాసు గారి 145 వ జయంతి శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో సుమిత్రా యూత్ అసోసియేషన్ ధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రిటైర్డ్ ఎం డి ఓశ్రీ మాధవరపు నాగేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు. సుమిత్ర యూత్ అధ్యక్ష కార్యదర్శులు పబ్బతి బ్రహ్మం సుమిత్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు కేశవ దాసు గారి జీవిత విశేషాలను తెలియజేశారు ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కురువెళ్ళ కృష్ణ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కళాకారులు కోట కళ్యాణ్, తల్లపురెడ్డి కిషోర్ రెడ్డి, అద్దంకి శ్రీకాంత్ ఇంటర్, 10, 9 తరగతుల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు