చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Published: Friday March 05, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గురునాద్ పల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురునాద్ పల్లి గ్రామానికి చెందిన ఎడుమేకల కిష్టయ్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక గతనెల 24 న పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా అతనిని వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం నిర్వహిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.
Share this on your social network: