రామచంద్రాపురంలో కంటివెలుగు శిబిరం ప్రారంభం..

Published: Friday February 10, 2023
తల్లాడ, ఫిబ్రవరి 9(ప్రజా పాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తోపాటు కార్యదర్శి సురేష్, విజయ్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ దొబ్బల శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేసి వృద్ధులకు, చూపులేని వారికి మంచి అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.