పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Published: Saturday June 04, 2022
ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీంద్రారెడ్డి..
 
తల్లాడ, జూన్ 3 (ప్రజాపాలన న్యూస్)
 
  పల్లెప్రగతి కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేయాలని ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో భీమిరెడ్డి రవీంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం తల్లాడ మండలంలోని లోని నూతనకల్లు గ్రామంలో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన వారు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా అధికారులంతా గ్రామాల్లో పర్యటించి పారిశుధ్యం మెరుగు పరచాలని సూచించారు. విద్యుత్తు లైన్లు, మిషన్ భగీరథ తాగునీరు, డ్రైనేజీలు తదితర సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించాలన్నారు. రానున్న వేసవికాలం నేపథ్యంలో ఏర్పాట్లను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూము శ్రీనివాసరావు, సెక్రెటరీ ఇజాజ్, ఏఈవో త్రివేణి, ఎంపీటీసీ బానోతు మోహన్, ఉప సర్పంచ్ సీతారాములు, నాయకులు శెట్టిపల్లి లక్ష్మణరావు, కళ్యాణపు కృష్ణయ్య, కళ్యాణపు వెంకటయ్య, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.*