మంత్రిని కలసిన నూతన వెల్గటూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు

Published: Friday June 25, 2021
వెల్గటూర్జూన్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : విలేకర్ల సమస్యలను పరిష్కరిస్తానని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.వెల్గటూర్ మండల నూతన ప్రెస్ క్లబ్ గురువారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి తెలంగాణ అభివృద్ధిని చేస్తున్న కె.సి.ఆర్ విలేకరుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ముందుంటారని ఆయన అన్నారు. మంత్రి కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మన్ యాదవ్ (సాక్షి), ప్రధాన కార్యదర్శి నాగుల రమేష్ (ఆధాబ్ హైదరాబాద్), ఉపాధ్యక్షులుగా కండ్లే రాజు (వార్త), పొడిటి రవి (తెలంగాణ కేసరి), ఆర్గనైజింగ్ కార్యదర్శి జూపాక కిరణ్ (సూర్య) సంయుక్త కార్యదర్శి కర్ణాల నాగరాజు (అక్షరం) వకుళ భరణం సత్యం (ఆంధ్ర భూమి) సింగు శ్రీనివాస్(ప్రజాకాలం) తదితరులు పాల్గొన్నారు.