అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
Published: Thursday December 22, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గం లో వివిధ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు - మన బడి, మన బస్తి - మన బడి కార్యక్రమంలో భాగంగా కన్నేపల్లి మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో డెబ్బై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న డైనింగ్ హాల్, అదనపు తరగతి గది, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, ఫ్లోరింగ్ రిపేర్, ఎలక్ట్రిసిటీ మరియు త్రాగునీటి సదుపాయాల పనులకు, మరియు జనకా పూర్ గ్రామంలో పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డుకు, శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ టి, సత్యనారాయణ , ఎంపీటీసీ భారతి, సర్పంచ్ లు సురేఖ , అశోక్ గౌడ్, తిరుపతి , ఉప సర్పంచ్ వెంకటేష్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, సంజీవ్ , పాఠశాల చైర్మన్ సంతోష్ , తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: