బిజెపి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
Published: Saturday August 27, 2022
- బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల టౌన్, ఆగష్టు 26, ప్రజాపాలన: బిజెపి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని శుక్రవారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం వరంగల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ రానున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలు, బూత్ స్థాయి నుండి తరలి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బిజెపి పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రజల్లో బిజెపి పార్టీకి వస్తున్న ఆదరణను జీరించుకొలేక బహిరంగ సభను విఫలం చెయ్యడం కోసం సభకు అనుమతిని రద్దు చేయడం శోచనీయం అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన బిజెపి కార్యకర్తలు సభకు వెళ్ళి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పొనుగోటు రంగ రావు, పెద్దపెల్లి పురుషోత్తం, పానుగంటి మధు, మాసూ రజిని, పైడిమల్ల నర్సింగ్, జోగుల శ్రీదేవి, బోద్దున మల్లేష్, గాజుల ప్రభాకర్, రాజమౌలి, తోట తిరుపతి, గంగన్న, బల్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: