డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం పది లక్షలు ఇవ్వాలి.

Published: Saturday November 19, 2022

జన్నారం, నవంబర్ 18, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవానికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానని 3 లక్షలు ఇవ్వాలని చూస్తుందని మూడు లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం కాదని అందుకోసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ తో ఇంటి స్థలం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలుగా కొనసాగుతున్న బిజెపి, కాంగ్రెస్, బి ఎస్ పి, మొదలగు పార్టీలు ప్రభుత్వం మంజూరు చేసే మూడు లక్షలు ఇంటి నిర్మాణానికి సరిపోవని ప్రస్తావించకుండా ప్రజల తక్షణ మాట్లాడకుండా మౌనంగా ఉండడం విచారించదగ్గ విషయం అన్నారు. పథకాలు విఫలమైనంక ఆందోళనలు చేయడమేనా ప్రతిపక్ష పార్టీపార్టీ పాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖాపురం రవి ప్రధాన కార్యదర్శి జన్నారం మండల గంగపుత్ర సంఘం తౌటు సంజీవ్ జన్నారం మండలం తదితరులు పాల్గొన్నారు.