బండ లేముర్ గ్రామంలో మేడే జెండా పండుగ ఘనంగా జరిపారు

Published: Monday May 02, 2022
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మంచాల మండలం లో మేడే నిర్వహించి కార్మిక జండా ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మంచాల మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, ఆరుట్ల లో జీ పి యూనియన్ రాష్ట్ర నాయకురాలు జోగు మాధవి, బండ లేమూర్ లో సీఐటీయూ నాయకులు జంగయ్య, చెన్నారెడ్డి గూడలో జీ పి యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జీ పాండు జండా ఆవిష్కరణ లు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు భాస్కర్, కుమారస్వామి, యాదయ్య, గాలయ, స్వరూప్, సుజాత కార్మికులు పాల్గొన్నారు. మేడే కార్యక్రమంలో భాగంగా బండ లేమూర్ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు వద్ద జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పోచమోని కృష్ణ, గ్రామ కార్యదర్శి జోగు శ్రీనివాస్, మాజి ఎంపీటీసీ లు వట్టి వెంకటేశ్, బి పద్మ, నాయకులు ఎమ్. వెంకటేశ్, బిక్షపతి, కళమ్మ, జగదీశ్వర్, జే కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.