విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉండాలి సిరిపురం హైస్కూల్ హెచ్ఎం

Published: Tuesday August 23, 2022

మధిర రూరల్ ఆగస్టు 22 ప్రజా పాలన ప్రతినిధి విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉండాలని సిరిపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సలీం సూచించారు. ఆజాదీకా అమృత మహోత్సవ్ సందర్భంగా సోమవారం విద్యార్థిని విద్యార్థినిలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సవంగా పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకుల వేషధారణతో ప్రదర్శన నిర్వహించారు అదేవిధంగా విద్యార్థినీల కోసం ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహమ్మద్ సలీం మాట్లాడుతూ ఎంతోమంది త్యాగదనుల పోరాటాల ఫలితంగానే దేశానికి స్వతంత్రం లభించిందన్నారు. అదేవిధంగా స్వతంత్ర పోరాటం గురించి  విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్లు సుజాత అరుణ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.