సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో మాటూర్ హైస్కూల్ విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

Published: Thursday February 11, 2021
మధిర, ఫిబ్రవరి 10 ప్రజాపాలనమధిర మండలంలోని మాటూర్ హైస్కూల్ విద్యార్థులకు మధిర సత్యసాయి సేవాసమితి జిల్లా కోఆర్డినేటర్  శ్రీ కోనా మోహనరావు, మరియు మధిర కన్వీనర్ మాటూరు వెంకట మురళీకృష్ణ గార్ల  చేతులమీదుగా నోటుబుక్స్, స్కేల్, పెన్స్ ఉచితంగా అందించటం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ D.సాయికృష్ణమాచార్యులు ఒక ప్రకటనలో తెలియజేసారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు చేయూత నివ్వటం చాలా గొప్ప విషయంగా పేర్కొంటూ సత్య సాయి సేవాసమితి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాటూర్ గ్రామ సర్పంచ్ మేడిశెట్టి లీలావతి, mptc అడపాల వెంకటేశ్వర్లు, smc చైర్మన్ మేడిశెట్టి రామకృష్ణారావు, కపిలవాయి సత్యనారాయణ రాజు, సేవాసమితి ex కన్వీనర్ కోటా రంగారావు, సభ్యులు కోనా గోపాలరావు, కృష్ణానాద్, పూల వెంకటేశ్వర్లు, sk. మాబు,M.శ్రీహరి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.