కంటిపరిక్షకు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి విజయ

Published: Saturday January 28, 2023
లక్షటిపెట్ ,జనవరి27,ప్రజాపాలన:
 
 కంటిపరిక్ష లకు వచ్చేవారితో సిబంది మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని 
డిప్యూటీ జిల్లా వైద్యాధికారి విజయ నిర్మల సూచించారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల్  
లో నిర్వహించే కంటివేలుగు శిబిరాన్ని  వైద్యాధికారి సందర్శించి కంటి పరీక్షలు నిర్వహించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  కంటి పరీక్షకు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి ఉన్న సమస్యను తెలుసుకోని కావాల్సిన చికిత్స చేయాలని సిబ్బందిని కోరారు. అంతే కాకుండా ఇక్కడికి చాలావరకు వయసుపడినవారు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అన్నారు. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి ఈ శిబిరంలో ఉచితంగా పరిక్షలు చేసి  అవసరమైతే అద్దాలు ఇస్తారని  కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరు ఈ  శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు .