అమ్మవారికి కిలో వెండి కవచం బహూకరణ

Published: Monday November 01, 2021

ఆలయ చైర్మన్ పదిరె నారాయణరావు

వెల్గటూర్, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) : కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి అమ్మవారికి కిలోవెండి మఖక కవచం బహూకరించిన రాచమల్ల విజయలక్ష్మి సత్యనారాయణ దంపతులు ఆదివారం రోజు బహూకరించిన ట్లు ఆలయ చైర్మన్ తెలియజేశారు. కరీంనగర్ వాస్తవ్యులు విజయలక్ష్మి సత్యనారాయణ కుటుంబ సమేతంగా కార్యనిర్వాహక అధికారి మరియు ఆలయ చైర్మన్ అదిరే నారాయణరావు అందించారు. ఆలయ అర్చకులు సంజీవ్, నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేసినారు.