45 మంది ఆవాస విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేసిన డా.శైలేందర్ రెడ్డి

Published: Thursday December 02, 2021

జగిత్యాల, డిసెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి): సేవాభారతి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో గత 29 సం.రాలుగా నిర్వహిస్తున్న శ్రీ వాల్మీకి ఆవాసంలో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రముఖ వైద్య నిపుణులు డా.శైలేందర్ రెడ్డి దంత వైద్య నిపుణులు జన్మదినం సందర్భంగా 45 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేసి, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వాల్మీకి ఆవాసంలో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఆశ్రయం పొంది ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ఇలాంటి విద్యా సంస్థకు తనవంతుగా చేయూతను అందించడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. అన్ని దానాల కంటే విద్యా దానం గొప్పదని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేస్తున్న ఆవాస నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆవాస సభ్యులు చిత్తారి మధుకర్, ఆవాస ప్రముఖ్ సుద్దాల మల్లేశం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.