ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *కొత్తపల్లి గ్రామంలో ఉన్న బొక్కల కంపెనీని వెం

Published: Friday March 03, 2023
*ప్రజలందరూ దుర్వాసనతో  ఇబ్బందులు పడుతున్న కానీ స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు*

బొక్కల కంపెనీని వెంటనే ముసివేయాలని,పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్**

రంగారెడ్డి జిల్లా,యాచారం మండలం,కొత్తపల్లి గ్రామా శివార్లు లో వెంకటేశ్వర గుడి ప్రక్కన/రైతుల పంటా పోలాల  మధ్య ల్లో  కిసాన్  ఆగ్రో ఫీడ్స్ అనే కంపెనీ స్థాపించి,దానిలో చట్ట విరుద్ధం గా పశువుల కుళ్ళు మాంసములను తెచ్చి,పశువుల యొక్క వ్యర్ధ పదార్ధాలను నిల్వ ఉంచి వాటి తో  కల్తీ వంట నూనెలను,డాల్డా,నెయ్యి వంటి ఆహారం కూడా కల్తీ చేస్తున్నారు.ఈ పశువుల వ్యర్ధ పదార్థములను నిల్వ ఉంచడము వలన  భరించలేని దుర్గంధం వాసనా రావడము వలన చుట్టూ పక్కన గ్రామాలు తక్కళ్లపల్లి తమ్మాలోనిగూడ,కిషన్ పల్లి,చింతపట్ల,తండాలు ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. చిన్న పిల్లలు,వృద్ధులు,రైతులు తమ పంటా పొలాల్లో వారి యొక్క వ్యవసాయం పనులు కూడా చేయలేక పోవుచున్నారు.పాడి పశువులు అనేకంగా చనిపోయినవి. ఇలా నీరు,గాలి,భూమి అంత పూర్తిగా కాలుష్యం అవుతుంది కావున ఇకనేనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కంపెనీని నామమాత్రం కాకుండా పూర్తిగా ముసివేయాలని గ్రామస్థులందరు డిమాండ్ చేయడం జరిగింది.తక్కలపల్లి సర్పంచ్ కంబాలపల్లి సంతోష వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్, కంబాలపల్లి విప్లవ కుమార్,  రజక సంఘం నాయకులు పగడాల కృష్ణ,సత్యనారాయణ.సంజీవవెంకటేష్,యాదగిరి,వెంకటేష్,రవి, వెంకటయ్య గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు..