టి.యు.ఎఫ్ గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కన్వీనర్ గా చాంద్ పాషా

Published: Friday August 06, 2021
జగిత్యాల, ఆగస్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సంఘ చైర్మన్ డా.చీమ శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కన్వీనర్ గా చాంద్ పాషా ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం విస్తరణ పై దృష్టి సారించాలని, ఉద్యమ కారులకై సంక్షేమ బోర్డు ఏర్పాటుకై నిరంతర కృషి చేయాలని రాష్ట్ర చైర్మన్ ఆదేశించారని అన్నారు. నియమించడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.