టి.యు.ఎఫ్ గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కన్వీనర్ గా చాంద్ పాషా
Published: Friday August 06, 2021
జగిత్యాల, ఆగస్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సంఘ చైర్మన్ డా.చీమ శ్రీనివాస్ ఆదేశాల ప్రకారం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కన్వీనర్ గా చాంద్ పాషా ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం విస్తరణ పై దృష్టి సారించాలని, ఉద్యమ కారులకై సంక్షేమ బోర్డు ఏర్పాటుకై నిరంతర కృషి చేయాలని రాష్ట్ర చైర్మన్ ఆదేశించారని అన్నారు. నియమించడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: