ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే
Published: Monday December 20, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామ నీకి చెందిన నాయిని శ్రీనివాస్ కు ఒక లక్ష రూపాయలు, సింగం తార కు అరవై వేలు, పడాల హరీష్ కు. ఇరవై వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం నాడు క్యాంపు కార్యాలయంలో అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు అత్యవసరంగా, అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ల ల్లో చికిత్స పొందుతున్న వారికి అందించేందుకు ఏర్పాటు చేసిన పథకమని ఇది బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఈ నిధులను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో, గురిజాల సర్పంచ్ గాజుల రజిత వెంకటేష్ గౌడ్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, భీమాగౌడ్, శుభాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: