ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి ***అంగన్వాడీ ఉద్యోగుల 3 రోజుల సమ్మెను విజయవం

Published: Wednesday March 01, 2023
రేపటి నుండి జరిగే అంగన్వాడీ ఉద్యోగుల 3 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని Citu మంచాల మండల కన్వీనర్
పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు. మార్చి 1, 2,3 తేదీలలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ యూనియన్  సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ మూడు రోజులు అంగన్వాడీ
  సెంటర్స్ కు తాళం వేసి విధులు నిర్వహించకుండ  టీచర్స్, హేల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ కలిసి సమ్మెలో పాల్గొనాలని ఆయన అన్నారు.
మార్చ్ 1,2 తేదీలలో ప్రాజెక్టు కేంద్రాల వద్ద  36 గంటల ధర్నా వంటా వార్పూ ఉంటుందని చెప్పారు.3 వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుందనీ అన్నారు.రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేస్తేనే ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తుంది. కావున సమ్మె లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం కృషి చేయాలని కోరారు.