ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

Published: Monday September 19, 2022
పట్టణ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జుంజురు ప్రదీప్ కుమార్
వికారాబాద్ బ్యూరో 18 సెప్టెంబర్ ప్రజా పాలన : చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు అని న్యాయవాది పట్టణ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జుంజురు ప్రదీప్ కుమార్ ( దీపు ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని న్యాయవాది పట్టణ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జుంజురు ప్రదీప్ కుమార్ ( దీపు ) మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ సెంచనరీ సెంట్రల్ చర్చ్ లో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించానని స్పష్టం చేశారు. మెథడిస్ట్ సెంచనరీ సెంట్రల్ చర్చ్ జిల్లా సూపరింటెండెంట్ సుదర్శన్ పాస్టర్ జాన్ విక్టర్లు ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని వివరించారు. ఎంపీ రంజిత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని ఆ భగవంతున్ని ప్రత్యేకంగా కోరానని తెలిపారు. ప్రజాసేవే పరమార్థంగా భావించి ప్రజాసేవకే అంకితం అవుతున్న సహృదయుడు మృదుస్వభావి ఆప్తులకు ఆపన్న హస్తం అందించే దయార్ద్ర హృదయుడు చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే ప్రజా నాయకుడు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరెన్నో ఉన్నత పదవులు అధిష్టించాలని మనసా వాచా కోరుకుంటున్నానని తెలిపారు.