జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతను కలసిన శ్రీ భలరామకృష్ణ యువజన సంఘం నాయకులు

Published: Wednesday October 13, 2021
జగిత్యాల, అక్టోబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన శ్రీ భలరామకృష్ణ యాదవ సహకార సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం రోజున జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ ను జడ్పీ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతన కార్యవర్గానికి జడ్పీ చైర్ పర్సన్ వసంత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిక్కల ప్రభాకర్ సంఘం అధ్యక్షుడు అన్నం రాజేందర్ ప్రధాన కార్యదర్శి గొర్ల ప్రశాంత్ ఉపాధ్యక్షుడు కటికరెడ్డి సతీష్ గొడుగు మధుసూదన్ మహేష్ మల్లేశ్ నరేందర్ అంజన్న చంద్రప్రకాశ్ నారాయణ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.