ప్రజా పరిరక్షణ దీక్షకు బయల్దేరిన బోనకల్ మండల బిజెపి నాయకులు అరెస్ట్

Published: Friday March 18, 2022
బోనకల్, మార్చి 17 ప్రజాపాలన ప్రతినిధి: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తలపెట్టిన ప్రజా పరిరక్షణ దీక్షకు బయల్దేరిన బోనకల్ మండల బీజేపీ నాయకులను బోనకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బోనకల్ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు మాట్లాడుతూ శాసనసభలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగా అకారణంగా శాసన సభ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన దానికి నిరసనగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రజా పరిరక్షణ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా గా భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు అందరూ బయలుదేరి వెళ్తుండగా బోనకల్ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విరపనేని అప్పారావు, గుగులోతు నాగేశ్వరావు, తాళ్లూరి సురేష్, జంపాల రవి, గంగుల నాగేశ్వరావు, కాలసాని పరశురాం,మరీదు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.