వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి

Published: Friday October 29, 2021
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ 
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో వందశాతం వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోనే 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలిచేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఇంటింటికి తిరిగి ఇప్పటి వరకు వాక్సినేషన్ వేసుకోని వారిని గుర్తించి, వీలైనంత తొందరగా టార్గెట్ పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఎమ్మార్వో కృష్ణ, మెడికల్ ఆఫీసర్ (MO) వినోద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆశ వర్కర్లు, ఆర్పిలు, ఏఎన్ఎంలు, స్పెషల్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.