మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం

Published: Friday January 21, 2022
హైదరాబాద్ 20 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కావలి రమేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం బేస్తవారం నాడు జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య  హాజరైనారు. ఈ సమావేశంలో మెహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా మాల ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎండవెట్ల యాదయ్య అదేవిధంగా మాలమహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మహబూబ్ నగర్ జిల్లా వాసి బ్యాగరి మన్యం నియామకం జరిగింది. నూతనంగా ఎన్నికైన వారికి ముఖ్య అతిథి చెన్నయ్య నియామక పత్రాలు అందజేశారు. మాల మహానాడు బలోపేతానికి అందరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బ్యాగరి చెన్నయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల కృష్ణయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగీ ఆనందరావు మహబూబ్ నగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరిందర్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బా రాములు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కనుగడ్డ యాదయ్య జిల్లా, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.