నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్

Published: Tuesday July 19, 2022
మంచ్చేర్యల టౌన్, జూలై 18, ప్రజాపాలన : నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంచిర్యాల నియోజకవర్గంలో వరద ముంపు వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల లోని ఎన్టీఆర్ నగర్,గణేష్ నగర్,  ఎల్ఐసి కాలనీ, చింతపండు వాడ, రెడ్డి కాలనీ ,రాళ్లపేట,రాం నగర్ ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన బాధితులకు నిత్యావసర సరుకులు  అందజేశారు, ఇప్పటివరకు నియోజకవర్గంలో 1500 మంది బాధితులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్ష పీడిత జిల్లాలకు పరిహారం ప్రకటించగా మంచిర్యాల ప్రాంతాన్ని విస్మరించడం విచారకరమని అన్నారు. మంచిర్యాల ప్రాంతంలో  వర్షాల వల్ల వరద ముంపుకు గురై చాలా మంది ఆర్థికంగా నష్టపోయారని  తెలిపారు.  కాలేశ్వరం ప్రాజెక్టు వల్లనే గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి తీర ప్రాంతాలను ముంపుకు గురిచేస్తోందని  అన్నారు.