69 జీవో రద్దు కై నేడు కలెక్టర్ కు విశ్వబ్రాహ్మణుల వినతి *
Published: Thursday August 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు24 (ప్రజాపాలన, ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 69 జీవోను రద్దు చేయాలని నేడు గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ట్లు విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఐక్య సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తూమోజు సురేష్ చారి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామోజు భాస్కరాచారి, అశోక్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన జీవో 69 ని అటవీశాఖ అధికారులు కార్పెంటర్ లపై దాడులు చేస్తున్నారని, కార్పెంటర్ ల జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 69 జీవో స్థానంలో 55 జీవో ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పిస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని విశ్వబ్రాహ్మణులు ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి రాగలరని కోరారు.
Share this on your social network: