ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి **మంచిపనులు అనేకం చేసాం... దైర్యంగా చెప్పుకుం

Published: Monday April 10, 2023

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం,
మంచాల మండల కేంద్రంలోని దండేటికారి ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి , రాష్ట్ర నాయకులు  క్యామ మల్లేష్ .
ఇటీవల అనారోగ్యంతో మరణించిన రంగాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమ కారుడు నయినంపల్లి గణేష్ గారికోసం 2నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించారు.ఎమ్మెల్యే  మాట్లాడుతూ...
కాంగ్రెస్ & బిజెపి పార్టీలు చేసిందేమీ లేదంటూ, బిఆర్ఎస్ పార్టీతోనే  అనేక అభివృద్ధి అయ్యిందని స్పష్టం చేశారు, చేసిన పనులు ప్రజలకు గుర్తు చేసే బాధ్యత మనదన్నారు.
ఇతర పార్టీలు కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమంలో ఉన్నారని, ప్రజలకు చేసేదేమీ లేదని,అబద్ధాల ప్రచారాలకే వారు పరిమితమని అన్నారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య,ఎంపీపీ నర్మదా,  మండల అధ్యక్షులు చీరాల రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంజి రెడ్డి, పీఏసియస్ చైర్మన్ పుల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బహుదూర్, నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.