కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Published: Wednesday September 28, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవాల సందర్భంగా మంగళవారం రోజున కోరుట్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్  పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా బాపూజీ సేవలు చిరస్మరణీయంగా వర్థిల్లుతాయాని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, విగ్రహ కమిటీ అధ్యక్షుడు ముల్క ప్రసాద్,బిసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం మధు,కటుకం వినయ్,చెన్న శ్రీనివాస్, ఎక్కల్దేవి నవీన్,చింతకింది ప్రేమ్,రుద్ర శ్రీనివాస్, బండి సురేష్,అది తదితరులు పాల్గొన్నారు.