మోడల్ కాలేజీ లో అడ్మిషన్లు ను పెంచండి...

Published: Friday July 02, 2021
పాలేరు, జూలై 1, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజాప్రతినిధులు, ఆధ్యాపకులు ఇంటింటా ప్రచారం చేయండి. పాలేరు ఎమ్మేల్యే కందాళ ఉపేందర్రెడ్డి. నేలకొండపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏకైక మోడల్ డిగ్రీ కాలేజీ నేలకొండపల్లిలో ఉండటం చాలా సంతోషమని, పూర్తి స్థాయిలో అడ్మిషన్లు పెంచాలని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి సూచించారు. స్థానిక మోడల్ డిగ్రీ కాలేజీలో గురువారం అడ్మిషన్లు బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్ల కోసం ఆధ్యాపకులు స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారం తీసుకోవాలని సూచించారు. సమన్వయంతో గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేయాలని అన్నారు. ఆడ్మిషన్ల విషయంలో అధ్యాపకులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, మండల స్పెషల్ ఆఫీసర్ విరూపాక్షి, ఎంపీడీవో యం.చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ పరంజ్యోతి, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బ్రహ్మయ్య, సర్పంచ్ సంఘం మండల అధ్యక్షుడు గండు