టీడీపీకి కరణం రామకృష్ణ రాజీనామా

Published: Friday July 16, 2021
వికారాబాద్ జూలై 15 ప్రజాపాలన బ్యూరో : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సైకిల్ దిగి కారు ఎక్కనున్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాజీనామా పత్రాన్ని పంపించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీని వీడాల్సి వస్తుందని ఎల్ రమణతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు పలువురు ఎంపీటీసీలు సర్పంచులు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో కలుస్తారని పేర్కొన్నారు. కరణం రామకృష్ణ మోమిన్ పేట మండలం కొత్త కొల్కొంద స్వగ్రామం కాగా టీడీపీ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎదిగారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండడంతో పాటు టీడీపీ పార్టీలో  చురుకైన యువనాయకుడిగా గుర్తింపు పొందాడు.