మండల వ్యాప్తంగా74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Saturday January 28, 2023

రాయికల్, జనవరి 26(ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంతోపాటు మండల వ్యాప్తంగా "74"వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగుల సంతోష్ కుమార్,తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎడ్ల అనిల్ కుమార్,మండల పరిషత్ కార్యాలయంలో ఎం.పీ.డీ.వో గంగుల సంతోష్ కుమార్,పోలీస్ స్టేషన్ లో ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ గౌడ్, వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏవో ముక్తేశ్వర్,అటవీ శాఖ కార్యాలయంలో ఆటవీశాధికారి తరి భూమేష్, స్త్రీ శక్తి కార్యాలయంలో ఏపీఎం శ్రీనివాస చక్రవర్తి,ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు, వివిధ రాజకీయ పార్టీలు, యువజన స్వశక్తి సంఘాల కార్యాలయాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట సర్పంచులు జాతీయ జెండాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని, భారత రాజ్యాంగ విశిష్టతను ప్రతి పౌరుడు తెలుసుకొని మహనీయుల బాటలో నడవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలని సూచించారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యములు ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉపయోగించుకొని ప్రజలందరూ శాంతి, సౌభాతృత్వాలతో జీవిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యకమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,ఆయా కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.