పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆర్థిక సహకారంతో మున్సిపల్ సిబ్బందికి దుస్తులు

Published: Friday December 23, 2022

పంపిణీ మధిర డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మున్సిపాలిటీ కార్యాలయంలోపసుర గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత పబ్బతి రవికుమార్ సహకారంతో మధిర మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు  క్రిస్టమస్ పండగ సందర్భంగా క్రిస్టమస్ కానుకగా దుస్తులను పంపిణీ చేశారు.ఈకార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరై కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  అతిథులుగా విచ్చేసిన  మున్సిపాలిటీ కమిషనర్ అంబటి రమాదేవి,చైర్ పర్సన్ ,మొండితోక లత జయాకర్,రంగశెట్టి కోటేశ్వరరావు, కళ్యాణం పుల్లారావు లు మాట్లాడుతూ పసుర గ్రూప్ ఆఫ్ కంపెనీ, పబ్బతి రవికుమార్ కుటుంబం మధిరలో స్వచ్ఛందంగా ఎన్నో  సేవా కార్యక్రమాలు చేసి, ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్నారని వారి సేవలను కొనియాడారు అనంతరం వారి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు.*ఈ సందర్భంగా  మున్సిపల్ సిబ్బంది కార్మికులు అబ్బతి రవికుమార్ కి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు*