టిపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌ రెడ్డి నియామకం పట్ల హర్షం

Published: Monday June 28, 2021
మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పుండ్రా శ్రీనివాస్ రెడ్డి
మల్లాపూర్, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి నియమితుల‌య్యారు. రేవంత్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఆదివారం మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పుండ్రా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రేవంత్‌ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన కేంద్ర కాంగ్రేస్ అధిష్టానం సభ్యులైన అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మర్రిపెల్లి సత్తమ్మ - మల్లయ్య, సొసైటీ డైరెక్టర్ పుండ్రా లక్ష్మారెడ్డి, కోటగిరి ఆనంద్ గౌడ్, తిరుపతి రెడ్డి, హన్మాండ్లు, హైమద్, మామిడి శేఖర్ రెడ్డి, చింతకుంట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సంబరాల్లో సిరిపూర్ కాంగ్రెస్ నాయకులు..
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మరియు ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కిగౌడ్ ఎన్నికైన సందర్భంగా సిరిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల బాపురెడ్డి, గడ్డం తిరుపతిరెడ్డి, మారిశెట్టి మహేష్, సోమ నాగార్జున్, పెంట శ్రీనివాస్, రాజు, సత్యం, శ్రీధర్, సాయి, సంజయ్, శ్రీనివాస్, రాజరెడ్డి, రవీందర్, ప్రమోద్, మాధవ రెడ్డి, శ్రీకాంత్, రాము నాయక్, రాజన్న, నాగరాజు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.