ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 21ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday August 22, 2022
యంబీఆర్ కాలనీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక*

*కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తా*
*నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి*


*ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని యంబీఆర్ నగర్ కాలనీ అధ్యక్షుడిగా నల్లబోలు శ్రీనివాస్ రెడ్డిని కాలనీ వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆదివారం రోజున ఏర్పాటు చేసిన కాలనీ సమావేశంలో కమిటీని ఎన్నుకొగా కమిటీ సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎం బి ఆర్  కాలనీ అభివృద్ధి కొరకు తన వంతుగా నిరంతరం కృషిచేసి మున్సిపాలిటీలో  యంబీఆర్ నగర్ కాలనీని అగ్రభాగాన నిలిపి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కాలనీ ప్రజలు కమిటీ సభ్యుల సమిష్టి కృషితో సలహాలు సూచనల మేరకు కాలనీ అభివృద్ధి చేస్తానని అన్నారు నాపై నమ్మకం పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్ల మహేష్ గౌడ్ శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు తదితరులు పాల్గొన్నారు.

*యంబీఆర్ నగర్ నూతన కమిటీ*

కమిటీ అధ్యక్షుడుగా నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా కుమ్మిడి నరసింహారెడ్డి, కోశాధికారిగా విరబొమ్మ వెంకటేష్ లను ఎన్నుకున్నారు. అనంతరం కాలనీ ఉత్సాహాల కమిటీని ఎన్నుకున్నారు. ఉత్సాహాల కమిటీ అధ్యక్షుడు కొత్వాల్ మహిపాల్, సభ్యులుగా టేకు హనుమంత్ రెడ్డి జి మహావీర్ రెడ్డి, ఆకుల యాదగిరి తదితరులను ఎన్నుకున్నారు.