ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా ఉప్పల్ ఆర్టీవో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Published: Friday February 11, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ ట్రెజరర్ టీజీఓల సంఘం, ఉప్పల్ ఆర్టీవో రవీందర్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో ఉద్యోగస్తులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీవో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి  చేసిన వ్యాఖ్యలు తెలంగాణలోని ప్రతి పౌరుని ఎంతగానో బాధించాయని తెలిపారు. ఎన్నో సంవత్సరాలు కొట్లాడి, పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ గురించి ప్రధాన మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యసభలో అలా మాట్లాడడం ఎంతో బాధ కలిగించాయని తెలిపారు.