రమణమ్మను ఓదార్చిన మాజీ ఎంపీ పొంగులేటి..

Published: Monday September 26, 2022
తల్లాడ, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడలో ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్ నాయకులు సరికొండ వీరంరాజు కుటుంబ సభ్యులను ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వీరంరాజు చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పొంగులేటిని చూసి వీరంరాజు సతీమణి రమణమ్మ ఒక్కసారిగా వినిపించడంతో ఆమెను ఓదార్చారు. అదేవిధంగా ఆయన కుమారుడు సరికొండ అప్పలరాజు, మాజీ ఎంపీపీ సరికొండ లక్ష్మీ పద్మావతి పరామర్శించి ఓదార్చారు. వీరంరాజు మృతి వ్యక్తిగతంగా తనకు, పార్టీకి ఎంతో తీరని లోటు అన్నారు. అదేవిధంగా నారాయణపురం, తల్లాడలో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయబాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తూము వెంకటనారాయణ, తుమ్మలపల్లి రమేష్, ఎర్రి నరసింహారావు, బానోతు నరసింహారావు, వేమిశెట్టి నాగన్న పొన్నం కృష్ణయ్య, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, షేక్ మీర్జా మైబు, షేక్ యాకూబ్ పాషా, తదితరులు ఉన్నారు.