ఇండియన్ రైల్వేస్ చైర్మన్ ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు.

Published: Friday December 16, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 15 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలో  రైల్వేస్ కు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం, ఇండియన్ రైల్వేస్ చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠిని  గురువారం పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత  మరియు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు,  ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం వారు స్థానిక విలేకరులతో చరవానిలో మాట్లాడారు,
బెల్లంపల్లి నియోజకవర్గం లోని పలు అంశాలను వారి దృష్టికి తిస్కెల్లడం జరిగిందని, తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ అండర్ బ్రిడ్జ్ యధావిధిగా పనిచేయించాలని మరియు  నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దక్షిన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు రాయ్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సంపర్క్ క్రాంతి, రైళ్లను నిలుపుదల చేయాలని కోరినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వేస్ చైర్మన్
 సానుకూలంగా స్పందించారని అన్నారు.