ఆర్ధిక సహాయం అందజేత

Published: Thursday July 28, 2022
జన్నారం, జూలై 27, ప్రజాపాలన: మండలంలోని పదవ తరగతి
పూర్వ విద్యార్థులు 1991-92 కు చెందిన బృందం బుధవారం మంచిర్యాల జిల్లా
జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన  ఆనందం అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అ కుటుంబమునకు పంద్దేనిమిది వేల ఐదువందల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆ బృందం మాట్లాడుతూ   కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు, ఎవరైనా దాతలు ఆదుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ పరంగా సహయం అందించాలని కోరినారు, ఈ కార్యాక్రమంలో పూర్వ విద్యార్థులు  శ్రీనివాస్, శంకర్, శ్రీను లు, బాదిత కుంటుబ సభ్యులు, పాల్గొన్నారు.