ఎస్.కె ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం

Published: Wednesday March 17, 2021
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్రెడ్డి
వికారాబాద్ జిల్లాలా ప్రతినిధి మార్చి 16 ( ప్రజా పాలన ) : మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల గ్రామానికి చెందిన క్యాసారం శంకరయ్య సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ కె ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి మృతుని ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల నగదును స్థానిక సర్పంచ్ సురేందర్ రెడ్డి ద్వారా మంగళవారం అందజేశారు. ఎస్ కె ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రశేఖర్, గౌరయ్య, రవీందర్, మల్లేశం, తదితరులు ఉన్నారు.