పేదల పాలిట వరంగా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి : కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్జి.
Published: Friday October 29, 2021
హైదరాబాద్ (ప్రజాపాలన సిటీ బ్యూరో) : పేదప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారిందని అన్నారు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్జి. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయిన సనత్ నగర్ డివిజన్ సాయిబాబానగర్ కు చెందిన ప్రభాకర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆరోగ్యఅవసరాల నిమిత్తం 60వేల రూపాయల చెక్కును కార్పొరేటర్ కొలను లక్ష్మిబాల్ రెడ్జి అందించారు. ఈ కార్యక్రమంలో టిఆరెస్ డివిజన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి ,స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: