ఈ నెల 17 నుండి డయల్ ఎమ్మెల్యే ఆనంద్

Published: Friday April 16, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 ప్రజా పాలన : వికారాబాద్ నియోజకవర్గంలోని తాగునీటి సమస్యను పరిష్కరించటం డయల్ ఎమ్మెల్యే ఆనంద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూర్, బంట్వారం, మోమిన్పేట్, మర్పల్లి, కోటపల్లి మండలాలలో మిషన్ భగీరథ తాగునీటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే డయల్ ఎమ్మెల్యే ఆనంద్ 83095 23321 నంబర్ కు ఫోన్ చేయాలని వివరించారు. 17 ఏప్రిల్ 2021 శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మిషన్ భగీరథ తాగునీటి సమస్యల గురించి ఆరు మండలాల ప్రజలు అడగవచ్చని సూచించారు. మండలంలో తాగునీటి ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత మిషన్ భగీరథ అధికారులతో వెంటనే పరిష్కరించబడుతుందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని తాగునీటి సమస్యల గురించి డయల్ ఎమ్మెల్యే ఆనంద్ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.