శివాలయంలో పూజలు నిర్వహించిన హరి నాయక్

Published: Tuesday January 10, 2023

జన్నారం, జనవరి 9, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తపలపూర్ గ్రామంలో శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని సోమవారం బిజెపి ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోనీ పలు కాలనీలో గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కెసిఆర్ బి ఆర్ ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని వయసు పైబడిన మరియు వితంతు అర్హులకు కూడా ఇప్పటివరకు పింఛన్ రాకపోవడం చాలా బాధాకరమన్నారు. కెసిఆర్ ప్రభుత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వం అధికారం వస్తుందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొమురయ్య, మండల శక్తి కేంద్ర ఇంచార్జ్ బూత్ అధ్యక్షులు బండి రాజన్న, బూత్ అధ్యక్షులు ఏనుగుల రాజేందర్, బూత్ ఉపాధ్యక్షులు చేవులమద్ది చందు, తిమ్మాపూర్ శక్తి కేంద్రం అధ్యక్షులు యుగేందర్, బిజెపి నాయకులు పాదం రాకేష్, చందనగిరి తిరుపతి, గుంటుకు రాజన్న, కాసర్ల రాజన్న, మాటేటి సతీష్, అంబడిపెళ్లి సత్తన్న, వేముల నగేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.