నర్సాపురం రవీందర్ కు జాతీయ సేవారత్న అవార్డు
Published: Thursday March 25, 2021
గొల్లపల్లి, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన రవీందర్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నర్సాపురం రవీందర్కు వారి సంస్థ ఆధ్వర్యంలో చేసినా అనేక సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి హైదరా బాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారంరోజున వల్లూరి పౌండేషన్ వారి ఆధ్వర్యంలో జాతీయ సేవ రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మిత్రులు శ్రేయోభిలాషులు కనుకుంట్ల మహిపాల్ రెడ్డి కచ్చు కొమురయ్య గడ్డం శ్రీనివాస్ సజ్జనపు అశోక్ భోధనపు శ్రీనివాస్ అంకం భూమయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపుతు హర్షం వ్యక్తం చేశారు.
Share this on your social network: