చలివేంద్రం ప్రారంభం

Published: Friday April 23, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని గోకారం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం గోకారం గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఎర్ర చిన్న రామయ్య జ్ఞాపకార్థం ఆయన మనవడు ఎర్ర రవి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక సర్పంచ్ తుర్కపల్లి మాధవి సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని తాత జ్ఞాపకార్థం ఎర్ర రవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్ రాజ్, వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాలనర్సింహా వార్డు సభ్యులు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.