శంకరపట్నంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకరపట్నం నవంబర్ 07 ప్రజాపాలన ప

Published: Monday November 07, 2022

శంకరపట్నం నవంబర్ 07 ప్రజాపాలన ప్రతినిధి:

శంకరపట్నం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వమే ప్రతి గింజ కొంటుందని, నాణ్యమైన ధాన్యానికి గరిష్ఠ  గిట్టుబాటు ధర కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు భీమా లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టి దేశం లోనే ఆదర్శంగా నిలుస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి  శ్రీనివాస్, టీఆర్ఎస్  మండల అధ్యక్షుడు మహిపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరస్వామి సింగిల్ విండో చైర్మన్ లు టీఆర్‌ఎస్ నాయకులు  రైతులు తదితరులు హజారయ్యరు