సీఎం దిష్టిబొమ్మ దహనం

Published: Saturday November 19, 2022

మధిర  నవంబర్ 18 (ప్రజా పాలన ప్రతినిధి) బిజెపి ఎంపీ అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడానికి నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం మధిర పట్టణంలోని వైయస్సార్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ  అధికార మదంతో టిఆర్ఎస్ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ చేస్తున్న అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మంచి తీర్పునిచ్చి గుణపాఠం చెబుతారని అన్నారు. ఆ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెరుమాళ్ళపల్లి విజయరాజు, చిలివేరు సాంబశివరావు, రమేష్, చంద్రశేఖర్ రెడ్డి, నాగభూషణం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.