రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

Published: Friday November 25, 2022

జన్నారం, నవంబర్ 24, ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ జగన్మోహన్రావు వినతి పత్రం అందజేశారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్, మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ధరణి పోస్టర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతు రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగిపోతుయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా పోడు భూములకు పేదలకు హక్కుపత్రాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పసివుల్లా, పట్టణ అధ్యక్షుడు దుమాల రమేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడిపెళ్లి ఇందయ్య, నాయకులు ఏ దేవయ్య, అమృత రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్, మజ్ను, ప్రవీణ్, బచ్చలి శివ, సునీల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.