ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17 మహాసభలు జయప్రదం చేయండి.

Published: Monday December 12, 2022

ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభలు ఈనెల 13 నుండి 16 వరకు హైదరాబాద్ నగరంలో ఉద్యమాలకు పురిటిగడ్డ అయినా ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్నాయి 2005 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అత్యంత జయప్రదంగా గత మహాసభ జరుపుకున్నాం. 17 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్టమొదటిసారిగా 17 అఖిలభారత మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ మాణిక్ సర్కార్ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు విశ్వాస్ ఎస్ఎఫ్ఐ జాతీయ గర్ల్స్ కన్వీనర్ దీప్సితాదార్  జాతీయ నాయకులు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతున్నారు అని అన్నారు.  ఈ మహాసభలకు మేధావులు ప్రజాతంత్ర వాదులు విద్యార్థులు  విజయవంతం కోసం కృషి చేయాలని కోరారు. అదేవిధంగా 13 పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో లో జరిగే భారీ విద్యార్థి బహిరంగ సభకు విద్యార్థులంతా  పెద్ద ఎత్తున హాజరై  విజయవంతం చేయాలని కోరారు.