తాడికల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రజపాలన విలేకరి శంకరపట్నం డిసెంబర్ 11:

Published: Monday December 12, 2022

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో ఆదివారం రోజు  ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో  ఏర్పాటుచేసిన ఈ సమావేశం నేటికీ 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా  ముఖ్యంతులుగా విచ్చేసిన 2005,2006 సంవత్సరం  పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు  బోధించినటువంటి ఉపాధ్యాయులు సదానందం, రామాంజనేయులు, కైలాసం, భాస్కర్, ప్రవీణ్, పుల్లారెడ్డి, రాంప్రసాద్ అశోక్ లు పాల్గొనడం జరిగిందనీ విద్యార్థులు తెలిపారు. అనంతరం విద్యార్థులు ఇట్టి కార్యక్రమంలో పాఠశాలలో గడిపిన తీపి జ్ఞాపకాల ఉపాధ్యాయులతో నేర్చుకున్నటువంటి బోధనలను గుర్తు చేసుకుంటూ ఆనందాలు వెదజల్లుతూ విద్యార్థులు ఒకరినొకరు కలుస్తూ గుర్తు  చేసుకోవడం జరిగిందని  విద్యార్థులు అన్నారు ఈ కార్యక్రమంలో ఎందరో పూర్వ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.