సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Friday November 25, 2022
బెల్లంపల్లి నవంబర్ 24 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి సాంఘీక సంక్షేమ ( బాలికల ) రెసిడెన్షియల్ పాఠశాల,  కళాశాలలో జరుగుతున్న ఈ సంవత్సరం జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ , జోన్-1 ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యఅతిథిగా హాజరై గురువారం  ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ టి, సత్యనారాయణ , బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత , వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బెల్లంపల్లి మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు,  ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.